కుప్పంలో మొరాయిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ సర్వర్లు
ABN , First Publish Date - 2021-01-16T21:53:51+05:30 IST
కుప్పంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సర్వర్లు మొరాయిన్నాయి. వాక్సినేషన్ వెబ్సైట్ పనిచేయక పోవడంతో బెనిఫీసిరీస్ పేర్లు కనిపించలేదు.
చిత్తూరు: కుప్పంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. వాక్సినేషన్ వెబ్సైట్ పనిచేయక పోవడంతో బెనిఫీసిరీస్ పేర్లు కనిపించలేదు. జిల్లాలో పలుచోట్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో అధికారుల దృష్టికి వైద్య శాఖ సిబ్బంది తీసుకెళ్లింది. మ్యాన్వల్గా వారి గుర్తింపు కార్డులు ఆధారంగా వైద్యులు వాక్సిన్ వేస్తున్నారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పారంభించారు. విజయవాడ జీజీహెచ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎం జగన్ పరిశీలించారు. విజయవాడ జీజీహెచ్లో వైద్యసిబ్బందితో సీఎం మాట్లాడారు. టీకా వేయించుకున్నవారితో కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కోసం 332 కేంద్రాలను ఏర్పాటు చేశారు.