కొవిడ్‌ టీకాపై అపోహలొద్దు

ABN , First Publish Date - 2021-02-25T04:10:22+05:30 IST

కొవిడ్‌ టీకాపై ఎరికికీ ఎలాంటి అపోహలు వద్దని సీఐ వి.శ్రీరామ్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్య శాలలో పోలీసు సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు.

కొవిడ్‌ టీకాపై అపోహలొద్దు

పొదిలి, ఫిబ్రవరి 24 : కొవిడ్‌ టీకాపై ఎరికికీ ఎలాంటి అపోహలు వద్దని సీఐ వి.శ్రీరామ్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ  వైద్య శాలలో పోలీసు సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ టీకాను వేయించుకోవాలని శ్రీరామ్‌ కోరారు. పొదిలి, మర్రిపూడి ఎస్‌ఐలు కె.సురేష్‌, సుబ్బరాజు, 20 మంది పోలీసులు టీకా వే యించుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు షహీరా, రఫీ, సంగీత, అశ్వని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

బేస్తవారపేటలో..

బేస్తవారపేట : బేస్తవారపేట తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు మొత్తం 22 మంది కొవిడ్‌ టీకాను వే యించుకున్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో తొలుత అధికారులకు వ్యాక్సినేషన్‌ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీకాపై అవగాహన కల్పించారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని తహసీల్దార్‌ బీ రమాదేవి కోరారు. 

Updated Date - 2021-02-25T04:10:22+05:30 IST