కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం: జేసీ

ABN , First Publish Date - 2021-01-21T05:34:23+05:30 IST

‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదు. వ్యాక్సిన్‌ సురక్షితం’ అని జేసీ వీరబ్రహ్మం తెలిపారు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం: జేసీ

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 20: ‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదు. వ్యాక్సిన్‌ సురక్షితం’ అని జేసీ వీరబ్రహ్మం తెలిపారు. బుధవారం తన కార్యాలయం నుంచి వైద్యాధికారులతో వ్యాక్సిన్‌పై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ కొరత లేదని, అర్హులైన ఆరోగ్య కార్యకర్తల జాబితాను ఇది వరకే ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలో ఉన్న వైద్య సిబ్బంది అందరూ విధిగా వ్యాక్సిన్‌ తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరిండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:34:23+05:30 IST