అందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-04-11T05:18:03+05:30 IST

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వే యించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర మేయర్‌ గంగాడ సుజాత కోరారు. శనివారం నగరంలోని 50వ డివిజన్‌ వెంకటేశ్వరకాలనీ సచివా లయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి టీకా తీసుకున్నారు.

అందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
టీకా తీసుకుంటున్న మేయర్‌ గంగాడ సుజాత

నగర మేయర్‌ గంగాడ సుజాత 


ఒంగోలు (కార్పొరేషన్‌) ఏప్రిల్‌ 10 : ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వే యించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర మేయర్‌ గంగాడ సుజాత కోరారు. శనివారం నగరంలోని 50వ డివిజన్‌ వెంకటేశ్వరకాలనీ సచివా లయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రజలు అ పోహలు వీడి వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వేమూరి వెంకటసూర్యనారాయణ, కా ర్పొరేటర్‌ అంబటి ప్రసాదరావు, కమిషనరు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


Updated Date - 2021-04-11T05:18:03+05:30 IST