ఐదో రోజు 1,674 మందికి టీకా
ABN , First Publish Date - 2021-01-21T05:52:45+05:30 IST
హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఐదోరోజు విజయవంత మైనట్లు డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(హాస్పిటల్), జనవరి 20: హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఐదోరోజు విజయవంత మైనట్లు డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం 53 కేంద్రాల్లో రిజిస్టర్ అయిన 4,070 మంది హెల్త్కేర్ వర్కర్లలో 1,674 మందికి టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకోలేదని, ఐదో రోజు వ్యాక్సినేషన్ 43 శాతం నమోదైందని వెల్లడించారు.
ఏడుగురికి కరోనా
జిల్లాలో గత 24 గంటల్లో 3,402 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 60,751 మందికి కరోనా సోకగా.. వీరిలో 60,206 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 58 మంది చికిత్స పొందుతున్నారు.