‘వ్యాక్సినేషన్ పూర్తి ఘనత ప్రధానిదే’
ABN , First Publish Date - 2021-10-24T05:11:42+05:30 IST
సర్పవరం జంక్షన్, అక్టోబరు 23: కరోనా నివారణ కోసం అకుంఠిత దీక్షతో కృషి చేయడమే కాకుండా వందకోట్లకుపైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్పొరేషన్ 49వ డివిజన్లో శరణ్య
సర్పవరం జంక్షన్, అక్టోబరు 23: కరోనా నివారణ కోసం అకుంఠిత దీక్షతో కృషి చేయడమే కాకుండా వందకోట్లకుపైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్పొరేషన్ 49వ డివిజన్లో శరణ్య స్కూల్, ఆర్ఎంసీలో బీజేపీ నాయకుల ఆధ్వర్యాన శనివారం కరోనా వారియర్స్, హెల్త్ వర్కర్లను ఘనంగా సత్కరించారు. జిల్లా ధార్మికసెల్ కన్వీనర్ కవికొండల భీమశేఖర్, పార్టీ నాయకులు వెంకటేష్, గౌతు చిన్నారావు, పితాని లీలావతి, యార్లగడ్డ వెంకటనాయుడు, ప్రతాప్ పాల్గొన్నారు.