కోవిడ్‌’ డయాగ్నోసిస్‌ యూనిట్లకు సైయెంట్‌ పరికరాలు

ABN , First Publish Date - 2020-04-01T06:13:58+05:30 IST

కోవిడ్‌-19 వైర్‌సను గుర్తించే డయాగ్నోసిస్‌ యూనిట్ల, ఎక్స్‌-రే సిస్టమ్స్‌ తయారీకి హైదరాబాద్‌కు సైయెంట్‌ పరికరాలను అందించనుంది. కీలకమైన మెడికల్‌...

కోవిడ్‌’ డయాగ్నోసిస్‌ యూనిట్లకు సైయెంట్‌ పరికరాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోవిడ్‌-19 వైర్‌సను గుర్తించే డయాగ్నోసిస్‌ యూనిట్ల, ఎక్స్‌-రే సిస్టమ్స్‌ తయారీకి హైదరాబాద్‌కు సైయెంట్‌ పరికరాలను అందించనుంది.  కీలకమైన మెడికల్‌ ఇక్వి్‌పమెంట్‌ తయారీకి అవసరమైన పరికరాల తయారీకి మైసూర్‌లోని కంపెనీ యూనిట్‌కు అనుమతి లభించినట్లు సైయెంట్‌ డీఎల్‌ఎం సీఈఓ రాజేంద్ర వెలగపూడి తెలిపారు. మైసూర్‌ ప్లాంట్‌లోని మెడ్‌టెక్‌ తయారీ సదుపాయంలో వీటిని తయారు చేస్తారు. జీఈ హెల్త్‌కేర్‌ తయారు చేస్తున్న ఎక్స్‌-రే జనరేటర్లు, మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ ఉత్పత్తి చేస్తున్న యూనిట్లలో వీటిని వినియోగిస్తారు.

Updated Date - 2020-04-01T06:13:58+05:30 IST