ప్రవేశ పరీక్షకు హాజరైన కరోనా రోగులు

ABN , First Publish Date - 2020-12-03T23:59:36+05:30 IST

ప్రవేశ పరీక్షకు హాజరైన కరోనా రోగులు

ప్రవేశ పరీక్షకు హాజరైన కరోనా రోగులు

సియోల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దక్షిణ కొరియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స తీసుకుంటున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు చేసేందుకు అవకాశం కల్పించింది.


దక్షిణ కొరియాలో ఆస్పత్రుల్లో గురువారం 35 మంది కరోనా వైరస్ రోగులు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అంతేకాకుండా స్వీయ-నిర్బంధంలో 404 మంది ప్రత్యేక వేదికలలో పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పోటీ పరీక్షకు హాజరయ్యారు.

Updated Date - 2020-12-03T23:59:36+05:30 IST