అసోంలో జూన్ 22 వ‌ర‌కూ క‌రోనా ఆంక్ష‌లు పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-16T12:53:58+05:30 IST

అసోం ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో క‌రోనా ఆంక్షలను సడలించింది.

అసోంలో జూన్ 22 వ‌ర‌కూ క‌రోనా ఆంక్ష‌లు పొడిగింపు

గువాహ‌టి: అసోం ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో క‌రోనా ఆంక్షలను సడలించింది. అయితే ప్రస్తుతం అమ‌లులో ఉన్న‌ కోవిడ్-19 నిషేధాజ్ఞల‌ను జూన్ 22 వరకు పొడిగించింది. ఈ మేర‌కు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్ డీఎంఏ)  కొత్త మార్గదర్శకాలను విడుద‌ల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు జూన్ 16 ఉదయం 5 గంటల నుండి జూన్ 22 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయి. రాష్ట్రంలో కోవిడ్-19 ప‌రిస్థితుల‌ను సమీక్షించామ‌ని,  కొన్ని జిల్లాల్లో కోవిడ్-19 బాధితుల‌ సంఖ్య, క‌రోనా వ్యాప్తి రేటు తగ్గుతోంద‌ని, అయినా పరిస్థితులు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉన్నాయ‌ని ఉత్తర్వుల‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19ను నియంత్రించేందుకు త‌గిన‌ చర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉత్తర్వుల‌లో తెలిపారు.

Updated Date - 2021-06-16T12:53:58+05:30 IST