ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు
ABN , First Publish Date - 2022-01-17T23:30:48+05:30 IST
పూణె: ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కోవిడ్పై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ చైర్మెన్ ఎన్కే అరోరా తెలిపారు
పూణె: ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కోవిడ్పై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ చైర్మెన్ ఎన్కే అరోరా తెలిపారు. 2 నుంచి 17ఏళ్ల వయసువారికి భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాగ్జిన్ను అత్యవసర వినియోగం కోసం కేంద్రం ఇప్పటికే అనుమతులిచ్చింది. మరోవైపు 15 నుంచి 18 సంవత్సరాల వయసువారిలో జనవరి 3 నుంచి మూడున్నర కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.