కరపలో కొవిడ్‌తో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-05-16T06:40:54+05:30 IST

కరోనా మహమ్మారితో కరపలో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో ఒకే ఇంట్లో ఉంటున్న అత్త, అల్లుడు గంటల వ్యవధిలో మరణించారు.

కరపలో కొవిడ్‌తో ముగ్గురు మృతి

ఒకే ఇంట్లో అత్త, అల్లుడు మృత్యువాత

కరప, మే 15: కరోనా మహమ్మారితో కరపలో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో ఒకే ఇంట్లో ఉంటున్న అత్త, అల్లుడు గంటల వ్యవధిలో మరణించారు. మెయిన్‌రోడ్డులో ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న యాళ్ల సుబ్బారాయుడు (42) రెండు వారాల క్రితం కొవిడ్‌ బారిన పడి కాకి నాడలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం నెగెటివ్‌ రావడంతో ఆయన్ను డిశ్చార్జి చేయడానికి వైద్యులు సిద్ధమయ్యారు. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఆక్సి జన్‌ లెవెల్స్‌ పడిపోయి మరణించాడు. అదే విధంగా మెరక వీధికి చెందిన  రైతు తుమ్మల వెంక టాచలం (60) వైరస్‌తో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మరణించారు. ఆయనతో పాటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న అత్త దూళ్ల నాగమణి (70) శనివారం సాయంత్రం మృతి చెందింది. 



Updated Date - 2021-05-16T06:40:54+05:30 IST