పులిదాడిలో ఆవు మృతి

ABN , First Publish Date - 2021-12-03T04:15:54+05:30 IST

మండలంలోని దిగిడ గ్రామంలో కుర్సింగ మధుకు చెందిన ఆవు పులి దాడిలో మృతిచెందినట్లు ఎఫ్‌బీవోలు మధుకర్‌, కిశోర్‌ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం పశువులను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా ఆవు తప్పి పోయింది.

పులిదాడిలో ఆవు మృతి

దహెగాం, డిసెంబరు 2: మండలంలోని దిగిడ గ్రామంలో కుర్సింగ మధుకు చెందిన ఆవు పులి దాడిలో మృతిచెందినట్లు ఎఫ్‌బీవోలు మధుకర్‌, కిశోర్‌ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం పశువులను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా ఆవు తప్పి పోయింది. తప్పిపోయిన ఆవు కోసం వెతకగా పులిదాడిలో మృతి చెందినట్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గురువారం పులిదాడి చేసిన ప్రాంతాన్ని ఎఫ్‌బీవోలు మధుకర్‌, కిశోర్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆవుపులిదాడిలో మృతిచెందినట్లు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి నివేదికను ఉన్నతా ధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-03T04:15:54+05:30 IST