కానిస్టేబుళ్ల కుటుంబాలకు పరిహారం అందజేత

ABN , First Publish Date - 2021-05-18T06:04:35+05:30 IST

అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుళ్లకు ప్రభుత్వ పరిహారాన్ని అందజేసినట్లు అడ్మిన్‌ డీసీపీ డి. మేరీ ప్రశాంతి తెలిపారు.

కానిస్టేబుళ్ల కుటుంబాలకు పరిహారం అందజేత
పరిహారం చెక్‌లను అందజేస్తున్న అడ్మిన్‌ డీసీపీ డి.మేరీ ప్రశాంతి

గుణదల, మే 17:  అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుళ్లకు ప్రభుత్వ పరిహారాన్ని అందజేసినట్లు  అడ్మిన్‌ డీసీపీ డి. మేరీ ప్రశాంతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ అమలేశ్వరరావు, పెనమ లూరు పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో చనిపోయిన బి.గోపాలకృష్ణ కుటుంబాలకు పరిహారం చెక్కులను ఆమె అందజేశారు.  అమలేశ్వరరావు భార్య లక్ష్మీలావణ్యకు రూ.10,35,000, తల్లి సీతామహాలక్ష్మికి రూ. 5,00,000,  తండ్రి వెంకటేశ్వరరావుకు రూ.5,00,000ల చెక్‌లను అంద జేశామని చెప్పారు. కానిస్టేబుల్‌ గోపాలకృష్ణ సతీమణి స్వాతికి రూ.1,31,311 అందజేశారు.  

హోంగార్డు కుటుంబానికి రూ.5లక్షలు

కొవిడ్‌తో మృతి చెందిన హోంగార్డు టి.వి.రాఘవులు భార్య టి.రాజేశ్వరికి రూ.5 లక్షల చెక్‌ను సీపీ బత్తిన శ్రీనివాసులు సోమవారం అందజేశారు.  పదవీ విరమణ చేసిన,  చనిపోయిన హోంగార్డు కుటుం బాలకు సహచర హోంగార్డుల తోడ్పాటుతోనే ఈ మొత్తాన్ని అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  



Updated Date - 2021-05-18T06:04:35+05:30 IST