నకిలీ ఆర్మీ అధికారిని అరెస్ట్ చేశాం : సీపీ సజ్జనార్

ABN , First Publish Date - 2020-09-29T23:11:39+05:30 IST

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడుతున్న

నకిలీ ఆర్మీ అధికారిని అరెస్ట్ చేశాం : సీపీ సజ్జనార్

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ ఆర్మీ అధికారి రఘువర్మ అలియాస్ కార్తీక్‌ను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. ఆర్మీ డ్రెస్‌లతో పాటు మెడల్స్‌ కొనుక్కున్నారని.. అవన్నీ నకిలీవేనన్నారు. ఆర్మీ అధికారులమంటూ కొన్ని షాప్‌ల ప్రారంభోత్సవాలు కూడా చేశారన్నారు.


డబ్బు కోసం ఈ నెల 5న బీహెచ్‌ఈఎల్ దగ్గర ఒకరిని కిడ్నాప్ చేశారని సీపీ తెలిపారు. నగరంలోని పంజాగుట్ట, రామంద్రాపురం పీఎస్‌లలో మోస్ట్‌ వాటెండ్‌గా నిందితులు ఉన్నారన్నారు. ఓఎల్‌ఎక్స్‌లో మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఐదుగుర్ని అరెస్ట్ చేశామని.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కేంద్రంగా ఓఎల్‌ఎక్స్‌ మోసాలకు పాల్పడుతుండేవారని ఆయన తెలిపారు. ఐదుగురు నిందితులపై ఇప్పటికే 40 కేసులు నమోదు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు.

Updated Date - 2020-09-29T23:11:39+05:30 IST