బ్యాట్మెంటన్, వాలీబాల్ కోర్టులను ప్రారంభించిన సీపీ
ABN , First Publish Date - 2021-06-24T16:58:10+05:30 IST
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 లక్షల వ్యయంతో ఈ రోజు బ్యాట్మెంటన్, వాలీబాల్ కోర్టులను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. అంబర్ పేట్
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 లక్షల వ్యయంతో ఈ రోజు బ్యాట్మెంటన్, వాలీబాల్ కోర్టులను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. అంబర్ పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో క్యాంటీన్ను సీపీ ప్రారంభించారు. క్యాంటీన్కు టెండర్స్ ఇచ్చి పోలీస్ సిబ్బందికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్ చాలా పెద్ద కమిషనరేట్.. ఏఆర్ సిబ్బంది ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం టాటా ఏరోస్పెస్ సహకారంతో బోట్ల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.