కరోనా కష్టకాలంలో ధరల భారమా
ABN , First Publish Date - 2021-06-18T05:11:03+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి ప్రజలపై వేస్తున్న ఆర్థిక బారాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు జి.వామనమూర్తి డిమాండ్ చేశారు.
పెట్రో మంటపై సీపీఐ ఆగ్రహం...నిరసన
విశాఖపట్నం, జూన్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి ప్రజలపై వేస్తున్న ఆర్థిక బారాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. సీతమ్మధారలో గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అన్ని రంగాల్లోని వారు ఆదాయం కోల్పోయి అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారని తెలిసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలు పెంచడం బాధ్యతా రాహిత్యమన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.