తెలంగాణలో నయా దోపిడి: Chada

ABN , First Publish Date - 2021-09-13T17:52:45+05:30 IST

తెలంగాణలో నిజాంనిరంకుశపాలన అంతమైంది...నయా దోపిడీ కొనసాగుతోందని రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

తెలంగాణలో నయా దోపిడి: Chada

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో నిజాంనిరంకుశపాలన అంతమైంది...నయా దోపిడీ కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ సాయుధ పోరాట 73వ వార్షికోత్సవ సభలో వెంకటరెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు నల్లచట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజలపై భారం మోపిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతుల భూములు బలవంతంగా లాక్కుని కేసులు పెడుతున్నారన్నారు. దళిత బందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-13T17:52:45+05:30 IST