కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోంది: D.Raja

ABN , First Publish Date - 2022-01-08T18:59:26+05:30 IST

కేంద్రం ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతోందని అన్నారు.

కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోంది: D.Raja

హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతోందని అన్నారు.  రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు 2024 ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాల పాత్ర కీలకం కాబోతోందన్నారు.  ఫాసిస్ట్ విధానాలకు తాము వ్యతిరేకమని తేల్చిచెప్పారు. సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అగ్రి చట్టాలపై రైతులు పోరాటం వలనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. కార్పొరేట్ సంస్థల వన్ మార్కెట్‌ను తీసుకువచ్చారన్నారు. పబ్లిక్ సెక్టార్లు అన్నింటినీ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని డీ.రాజా విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-01-08T18:59:26+05:30 IST