అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2021-08-26T23:55:52+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ నేత ముప్పాళ్ల
నెల్లూరు: అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మూడు వారాల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకొచ్చి 112 వారాలవుతున్నా పూర్తి న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంఘం పోరాటాల వల్లే ప్రభుత్వాలు కొంతమేరకైనా చెల్లింపులు చేశాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు.