AP: చంద్రబాబుకు సీపీఐ నేత నారాయణ ఫోన్
ABN , First Publish Date - 2021-10-22T16:04:25+05:30 IST
పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా 36 గంటల దీక్షకు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీపీఐ నేత నారాయణ ఫోన్ చేశారు.
అమరావతి: పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా 36 గంటల దీక్షకు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీపీఐ నేత నారాయణ ఫోన్ చేశారు. బాబు దీక్షకు నారాయణ ఫోన్లో సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లాలో అన్న ఏడూరి కారణంగా నేరుగా రాలేకపోయానని చంద్రబాబుకి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని చంద్రబాబుతో చెప్పారు. దీనికోసం అందరం కలిసి పని చేద్దాం అని టీడీపీ అధినేతకు నారాయణ సూచించారు.