నెంబర్ వన్ ఆర్థిక నేరస్తుడు మోదీ: Narayana
ABN , First Publish Date - 2021-09-16T15:22:43+05:30 IST
ఈ నెల 27న జరిగే భారత్ బంద్లో 19 పార్టీలు పాల్గొననున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.
శ్రీకాకుళం: ఈ నెల 27న జరిగే భారత్ బంద్లో 19 పార్టీలు పాల్గొననున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అందులో ప్రధాన డిమాండ్ మోదీ రాజీనామా చేయాలని, ప్రభుత్వం రూ.38 కోట్లు బీఎస్ఎన్ఎల్కి ఇవ్వాలని అన్నారు. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటు చేయడానికి మోదీ సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎవడబ్బ సొమ్మని ప్రేవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. నెంబర్ వన్ ఆర్థిక నేరస్తుడు మోదీ అని అన్నారు. మోదీ ఎలా చెబితే అలా ఆర్థిక మంత్రి సీతారామన్ ఆడుతున్నారన్నారు. మోదీ చేసే అరాచకాలు వల్ల నిఘా విభాగం దేశంలో ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీలు లేదని నారాయణ స్పష్టం చేశారు.