వారిద్దరూ తలుచుకుంటే అరగంటలోనే రాజధాని సమస్య పరిష్కారం: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-08-05T19:04:27+05:30 IST
వారిద్దరూ తలుచుకుంటే అరగంటలోనే రాజధాని సమస్య పరిష్కారం: రామకృష్ణ
అమరావతి: రాజధాని విషయంలో సీఎం జగన్మోహన్రెడ్డి పునరాలోచన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. మోదీ, అమిత్ షా తలచుకుంటే అరగంటలో రాజధాని సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే జగన్...రాజధాని తరలింపుకు అంత ప్రాధాన్యత ఇవ్వటం దేనికని ప్రశ్నించారు. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నాయని రామకృష్ణ తెలిపారు.