చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-12-03T13:45:31+05:30 IST

అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం మైనార్టీ సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు: రామకృష్ణ

అమరావతి: అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం మైనార్టీ సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయన్నారు. పోలీసుల వేధింపులతో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. అబ్దుల్ సలాం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-03T13:45:31+05:30 IST