వ్యవసాయ నల్ల చట్టాల రద్దు రైతాంగ పోరాటానికి విజయం: Ramakrishna
ABN , First Publish Date - 2021-11-19T16:06:04+05:30 IST
కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దు రైతాంగ పోరాటానికి విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దు రైతాంగ పోరాటానికి విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గత ఏడాది కాలంగా నిర్విరామంగా కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలపై రైతాంగం పోరాడిందని తెలిపారు. చారిత్రాత్మక పోరాటాన్ని మోడీ ప్రభుత్వానికి చవి చూపించిన రైతాంగానికి అభినందనలు తెలియజేశారు. యూపీతో సహా పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా బీజేపీ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు ఉన్నదన్నారు. 750 మందికి పైగా అన్నదాతల ప్రాణ త్యాగాల తదుపరి కేంద్రం సాగు చట్టాలను రద్దు నిర్ణయం తీసుకోవటం విచారకరమని రామకృష్ణ వ్యాఖ్యానించారు.