24న తిరుపతిలో జరగాల్సిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2021-11-22T17:21:28+05:30 IST
ఈనెల 24వ తేదీన తిరుపతిలో జరగాల్సిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది.
అమరావతి: ఈనెల 24వ తేదీన తిరుపతిలో జరగాల్సిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. వరదల కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామకృష్ణ తెలిపారు. సీపీఐ శ్రేణులు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏపీకి వరద సహాయం అందించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.