రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-03-03T17:24:09+05:30 IST

రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలి: Ramakrishna

అమరావతి: రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అభివృద్ధి పరిచి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలని రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2022-03-03T17:24:09+05:30 IST