మంత్రి విశ్వరూప్ బెదిరింపు వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-13T18:47:55+05:30 IST

శిరోముండనం ఘటనలో బాధితుడిపట్ల మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి విశ్వరూప్ బెదిరింపు వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

విజయవాడ: శిరోముండనం ఘటనలో బాధితుడిపట్ల మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో జరిగిన శిరోమండనం ఘటన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకుండా ప్రభుత్వం దోబూచులాట ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోవేదనతో ఆ యువకుడు నక్సలైటుగా మారతానని రాష్ట్రపతికి లేఖ రాశాడని...మంత్రి స్థానంలో ఉన్న విశ్వరూప్ బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘నక్సలైటుగా చేరితే నీ అంతు చూస్తామని బెదిరిస్తారా మీరు పాలకులా... ప్రజల పాలిట భక్షకులా..డీజీపీ కూడా ఈ కేసులో దోషులను ఎందుకు అరెస్టు చేయడం లేదు’’ అని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. రేపు తాము రాజమండ్రికి వెళుతున్నాం... దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతామని రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-08-13T18:47:55+05:30 IST