జగన్ ఎందుకు నోరు విప్పడం లేదు?: Ramakrishna
ABN , First Publish Date - 2021-12-07T19:11:16+05:30 IST
పోలవరం విషయంలో కేంద్ర వైఖరి సరిగాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
కడప: పోలవరం విషయంలో కేంద్ర వైఖరి సరిగాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అంచనాలు, సవరణ పేరుతో రూ.20 వేల కోట్లు కోతలు పెడుతున్నారని తెలిపారు. విభజన హామీలు, పోలవరం కోతలపై జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అలాగే వరద విపత్తు విషయంలో జగన్ స్పందన సరిగాలేదని విమర్శించారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని, వరదల్లో చనిపోయినవారికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.