AP: సీఎం జగన్కు రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2021-08-17T14:02:54+05:30 IST
ఏపీలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలంటూ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.
అమరావతి: ఏపీలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలంటూ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడుస్తున్నా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదన్నారు. అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలని అన్నారు. జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరానాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.