సీపీఐ నాయకుల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2020-11-23T06:39:00+05:30 IST

పోలవరం పరిరక్షణ ర్యాలీని తలపెట్టిన రామచంద్రపురం పట్టణశాఖ సీపీఐ నాయకులనుపోలీసులు గృహనిర్బంధం చేశారు.

సీపీఐ నాయకుల గృహ నిర్బంధం

రామచంద్రపురం, నవంబరు 22:  పోలవరం పరిరక్షణ ర్యాలీని తలపెట్టిన రామచంద్రపురం పట్టణశాఖ సీపీఐ నాయకులనుపోలీసులు గృహనిర్బంధం చేశారు. సీపీఐ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ స్టాలిన్‌, ఏఐటీయూసీ పట్టణ అధ్య క్షుడు ఉండవిల్లి గోపాలరావు, పట్టణ  సీపీఐ కార్యదర్శి పెద్దిరెడ్డి రాము, సీపీఐ జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్‌.శారదాదేవిలను పోలీసులు అరెస్ట్‌చేసి గృహనిర్బంధం చేశారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించడానికి వెళ్లకుండా అక్రమ అరెస్ట్‌లు ఏమిటని, ప్రజాస్వా మ్యంలో ఈచర్యలు పౌర హక్కులను కాలరాయడమేనని అన్నారు.  

మలికిపురం: పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు వెళ్లనీయకుండా దిండిలో పలువురు సీసీఐ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దేవ రాజేంద్రప్రసాద్‌, మేడిచర్ల సత్య నారాయణ, పెద్దిరెడ్డి రామారావు తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.  

అమలాపురం: చలో పోలవరానికి ఇచ్చిన పిలుపులో భాగంగా అమలాపురంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కె.సత్తిబాబును ఆదివారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల యువత సమావేశంలో పాల్గొన్న అనంతరం సత్తిబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Updated Date - 2020-11-23T06:39:00+05:30 IST