‘జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి’

ABN , First Publish Date - 2021-05-17T05:47:28+05:30 IST

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని సీపీఐ ఆధ్యర్యంలో నందికొట్కూరు పటేల్‌ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు.

‘జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి’

నందికొట్కూరు, మే 16: జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని సీపీఐ ఆధ్యర్యంలో నందికొట్కూరు పటేల్‌  సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు  రఘురామ్మూర్తి మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే 60మంది దాకా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వందించి ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌, రాము, శాలు, దానమ్మ, జయమణి, నూర్జహాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:47:28+05:30 IST