అమరావతిని తరలించలేరు: సీపీఐ నారాయణ
ABN , First Publish Date - 2020-08-14T19:48:59+05:30 IST
ఏపీ రాజధానిపై హైకోర్టు తాజా ఉత్తర్వులను సీపీఐ నారాయణ స్వాగతించారు. అమరావతిని ఏపీ ప్రభుత్వం ఇక తరలించబోదని వ్యాఖ్యానించారు
హైదరాబాద్: ఏపీ రాజధానిపై హైకోర్టు తాజా ఉత్తర్వులను సీపీఐ నారాయణ స్వాగతించారు. అమరావతిని ఏపీ ప్రభుత్వం ఇక తరలించబోదని వ్యాఖ్యానించారు. అమరావతిపై యథాతథ స్థితి కొనసాగంచటం ఏపీ ప్రభుత్వానికి తప్పదని పేర్కొన్నారు. ఈ నెల 16న మూడు రాజధానులకు శంకుస్థాపన చేయాలన్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. అమరావతిపై బీజేపీ నాయకులకే ఏకాభిప్రాయం లేదని విమర్శించారు. కరోనాను కట్టడి చేయటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏబీఎన్తో సీపీఐ నారాయణ అన్నారు.