పెగాసస్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టు: నారాయణ

ABN , First Publish Date - 2021-10-27T21:03:18+05:30 IST

పెగాసస్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టని సీపీఐ నారాయణ అన్నారు. జస్టిస్ రవీంద్ర కమిటీని స్వాగతిస్తున్నామన్నారు.

పెగాసస్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టు: నారాయణ

అమరావతి: పెగాసస్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టని సీపీఐ నారాయణ అన్నారు. జస్టిస్ రవీంద్ర కమిటీని స్వాగతిస్తున్నామన్నారు. విదేశాల నుంచి హెరాయిన్ ముంద్రా పోర్టుకు ఎలా చేరిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముంద్రా పోర్టు ప్రధాని శిష్యుడు ఆదాని ఆధ్వర్యంలో నడుస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమిత్‌షా కనుసన్నల్లో నడుస్తోందని చెప్పారు. పార్టీ ఆఫీసులపై దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. 

Updated Date - 2021-10-27T21:03:18+05:30 IST