పాలకుల రహస్య ఎజెండా అమలు: నారాయణ
ABN , First Publish Date - 2020-08-15T10:22:56+05:30 IST
: కొవిడ్ ముసుగులో పాలకులు ప్రజల ఎజెండాను పక్కనబెట్టి తమ రహస్య ఎజెండాను ..
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ ముసుగులో పాలకులు ప్రజల ఎజెండాను పక్కనబెట్టి తమ రహస్య ఎజెండాను అమలు చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. మక్దూం భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు.
ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాలు, కనీస అవసరాలను పట్టించుకోకుండా ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేశారని, ఏపీ సీఎం జగన్ రాజధానిని 3 ముక్కలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగానికి కేంద్రం కంటే నేపాల్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా తెలిపారు.