బొత్స పెద్ద పెయిడ్‌ ఆర్టిస్ట్‌: నారాయణ

ABN , First Publish Date - 2020-10-13T09:06:48+05:30 IST

నిద్రాహారాలు మాని 300 రోజులుగా దీక్షలు చేస్తున్న అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని మంత్రి బొత్స సత్యనారాయణ ..

బొత్స పెద్ద పెయిడ్‌ ఆర్టిస్ట్‌: నారాయణ

తిరుపతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి):నిద్రాహారాలు మాని 300 రోజులుగా దీక్షలు చేస్తున్న అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడటం సిగ్గుచేటని, నిజానికి ఆయనే పెద్ద పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు సంఘీబావంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ, సీపీఐ శ్రేణులు సోమవారం సంయుక్తంగా నిరసనదీక్ష చేపట్టాయి. దీనిలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. రాజధానిని మూడు ముక్కలుగా చేయాలని భావిస్తున్న జగన్‌ ఆటలు సాగనివ్వబోమని, ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు.


రాజధానిని 3గా విభజిస్తామనే అజెండాతో మళ్లీ జగన్‌ ఎన్నికలకు వెళ్లి గెలిస్తే తప్ప ఇప్పుడు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. న్యాయవ్యవస్థను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, ఇలా వ్యవస్థలను ఖూనీ చేసేందుకు ఆయనను ప్రజలు ఎన్నుకోలేదన్నారు. అమరావతికోసం మద్దతిచ్చే రాజకీయ పార్టీలు అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేయాలన్నారు.

Updated Date - 2020-10-13T09:06:48+05:30 IST