దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోంది: రాజా

ABN , First Publish Date - 2020-02-22T22:23:13+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోందని సీపీఐ నేత రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకే ప్రధాని మోదీ యత్నిస్తున్నారని, మోదీ కార్పోరేట్ సంస్థలకు మాత్రమే

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోంది: రాజా

మంచిర్యాల: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోందని సీపీఐ నేత రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకే ప్రధాని మోదీ యత్నిస్తున్నారని, మోదీ కార్పోరేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతున్నారని రాజా ఆరోపించారు. మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర మహాసభలను రాజా  ప్రారంభించారు. ఈ సమావేశాల్లో జాతీయ నేతలు నారాయణ, కుమార్ అంజన్, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీనియర్ నేతలు కూనం నేని, పువ్వాడ, పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-22T22:23:13+05:30 IST