రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర

ABN , First Publish Date - 2021-03-05T23:59:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర

పశ్చిమ గోదావరి: రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి జగన్ ప్రభుత్వం పాతర వేస్తోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల లాగా పోలీసులే చలామణి అవుతున్నారని రామకృష్ణ విమర్శించారు. కడప జిల్లాలో ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతిపక్ష అభ్యర్థులపై కేసులు పెడతామని పోలీసులే బెదిరించి బలవంతంగా విత్‌ డ్రాలు చేయించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలను జరిపించాలని రామకృష్ణ డిమాండ్  చేశారు. 

Updated Date - 2021-03-05T23:59:25+05:30 IST