కేంద్ర విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-12-19T00:31:16+05:30 IST

ఇటీవల రాయసీయంలో కురిసిన అధిక వర్షాలకు జరిగిన నష్టాన్ని

కేంద్ర విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ

కర్నూలు: ఇటీవల రాయసీయంలో కురిసిన అధిక వర్షాలకు జరిగిన నష్టాన్ని కేంద్ర విపత్తుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంతవరకూ పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో మంత్రులెవరూ పర్యటించలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలన్నారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా కావాలంటే విశాఖ వెళ్లి చావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేసి అప్పుల ఊబి నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 

Updated Date - 2021-12-19T00:31:16+05:30 IST