ఊహించిన దానికన్నా కరోనా ప్రబలుతోంది: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-04-07T16:11:56+05:30 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు..

ఊహించిన దానికన్నా కరోనా ప్రబలుతోంది: రామకృష్ణ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కోరారు. రాష్ట్రంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా కరోనా వ్యాధి ప్రబలుతోందని... ఇప్పటికే 300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. లాక్‌డౌన్ కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల పరిస్థితి దయనీయంగా తయారైందని రామకృష్ణ పేర్కొన్నారు.


మరో పక్క రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. నిల్వ చేసుకోలేని కూరగాయలు, పండ్లు వంటి పంటలు రైతులు అమ్మకోలేని స్థితి ఉందన్నారు. వినియోగదారునికి అందుబాటులోలేని స్థితి నెలకొందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 7000 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రామకృష్ణ పేర్కొన్నారు. కరోనా విపత్తుపై చర్చించేందుకు ప్రధాని సైతం ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. 


తక్షణం మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ లేఖలో కోరారు.

Updated Date - 2020-04-07T16:11:56+05:30 IST