వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-04-10T14:57:06+05:30 IST

అమరావతి: అకాల వర్షం సృష్టించిన బీభత్సంతో మరణించిన వారి కుటుంబాలకు రు.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి: రామకృష్ణ

అమరావతి: అకాల వర్షం సృష్టించిన బీభత్సంతో మరణించిన వారి కుటుంబాలకు రు.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారు.


అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వరి, పెసర, మిర్చి, మొక్కజొన్న, అరటి, మామిడి తదితర పంటలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 14 మంది మృత్యువాత పడ్డారని రామకృష్ణ లేఖలో పేర్కన్నారు. కరోనా విపత్తుకు తోడు వర్ష బీభత్సం రైతులకు శాపంగా పరిణమించిందన్నారు. పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ కోరారు.


Updated Date - 2020-04-10T14:57:06+05:30 IST