రహదారిపై పడుకుని నిరసన

ABN , First Publish Date - 2021-10-18T04:52:36+05:30 IST

నిడదవోలు సంతమార్కెట్‌ వద్ద నుంచి సెయింట్‌ ఆన్స్‌ వరకు గల మున్సిపల్‌ రోడ్డు భారీ గోతులతో ప్రమాదకరంగా మారిందని సీపీఎం నాయకుడు రాంబాబు విమర్శించారు.

రహదారిపై పడుకుని నిరసన
నిడదవోలు సెయింట్‌ ఆన్స్‌ వద్ద గోతుల రోడ్డుపై పడుకుని నిరసన

నిడదవోలు, అక్టోబరు 17 : నిడదవోలు సంతమార్కెట్‌ వద్ద నుంచి సెయింట్‌ ఆన్స్‌ వరకు గల మున్సిపల్‌ రోడ్డు భారీ గోతులతో ప్రమాదకరంగా మారిందని సీపీఎం నాయకుడు రాంబాబు విమర్శించారు. ఆదివారం గోతులు పడిన రోడ్లలో అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. స్కూల్‌ జోన్స్‌ పరిధిలోని రోడ్లపై భారీ వాహనాలు అత్యధిక లోడుతో వెళుతూ రోడ్లు ధ్వంసం అవుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. తక్షణం రోడ్లకు మర మ్మతులు నిర్వహించి పాఠశాలలు ఉన్న రోడ్లలో భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలన్నారు. నిరసనలో పొదిలి శ్రీనివాసరావు, జి.ప్రసన్న, దానియేలు, కె.సత్యనారాయణ, అంబటి పుల్లారావు, నరేష్‌, నాని, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T04:52:36+05:30 IST