25డివిజన్లలో పోటీకి సీపీఎం నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-17T06:17:55+05:30 IST

25డివిజన్లలో పోటీకి సీపీఎం నిర్ణయం

25డివిజన్లలో పోటీకి సీపీఎం నిర్ణయం

ఖమ్మం మయూరిసెంటర్‌, ఏప్రిల్‌ 16: టీఆర్‌ఎస్‌తో సీపీఎంకు పొత్తు ఉంటుందని అందరూ భావించినా.. ఆ పార్టీ మాత్రం ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 25డివిజన్లలోపోటీ చేయాలని నిర్ణ యించుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆ పార్టీ జిల్లా కమి టీ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో పొత్తుల విషయమై ప్రతిపాదన వచ్చినా.. సీపీఎం మాత్రం 25డివిజన్లలోనామినేషన్లు వేయాలని, ఆదివారం నాటికి తమతో కలిసి వచ్చే పార్టీలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈక్రమంలో  కాంగ్రెస్‌, టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకుని, సీపీఎం పోటీ చేసే కాంగ్రెస్‌, టీడీపీ, ఈ రెండూ బరిలో ఉన్న డివిజన్లలో సీపీఎం పోటీకి దూరంగా ఉండేలా ఓ ఒప్పందానికి రానున్నట్టు తెలు స్తోంది. ఈ క్రమంలో టీడీపీ 13డివిజన్లలో పోటీ చేయనుంది.

టీఆర్‌ఎస్‌తో ఐదు సీట్లకు సీపీఐ ప్రతిపాదన..

సీపీఐ టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేసే క్రమంలో తము ఐదు డివిజన్లు కేటాయించాలన్న ప్రతిపాదనను మంత్రి అజయ్‌కుమార్‌ ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కూడా ఐదు డివిజన్లను సీపీఐకి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో తమకు పట్టున్న డివిజన్లను కేటాయించాలని సీపీఐ నాయకులు మంత్రిని కోరగా.. శనివారం సీపీఐ, టీఆర్‌ఎస్‌ల మధ్య జరిగే చర్చల తర్వాత ఓ స్పష్టత రానుంది. 

Updated Date - 2021-04-17T06:17:55+05:30 IST