అన్యాక్రాంతమైన భూములు పేదలకు పంచాలి: రాంభూపాల్

ABN , First Publish Date - 2020-06-05T14:51:04+05:30 IST

అన్యాక్రాంతమైన భూములు పేదలకు పంచాలి: రాంభూపాల్

అన్యాక్రాంతమైన భూములు పేదలకు పంచాలి: రాంభూపాల్

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములను తీసుకుంటున్నారని సీపీఎం నేత రాంభూపాల్ ఆరోపించారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ అన్యాక్రాంతమైన భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల అర్హుల జాబితాను ముందే ప్రకటించాలన్నారు. లబ్దిదారుల ఎంపికలో వైసీపీ నేతలు పక్షపాతం చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం అర్హుల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని... అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని రాంభూపాల్ తెలిపారు. 

Updated Date - 2020-06-05T14:51:04+05:30 IST