రైతుల పక్షాన నిలబడాలి: తమ్మినేని
ABN , First Publish Date - 2021-12-11T01:52:34+05:30 IST
ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పక్షాన
సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పక్షాన కాదు.. రైతుల పక్షాన నిలబడాలని సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కేసీఆర్ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారని తమ్మినేని అన్నారు. ఢిల్లీలో పోరాటం చేస్తా అన్నారు.. కనీసం మాట్లాడింది లేదని ఆయన విమర్శించారు.