సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-10-25T04:47:53+05:30 IST

సీపీఎం జిల్లా మహాసభలను జయ ప్రదం చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎ.రవి పిలుపునిచ్చారు.

సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా వర్గ సభ్యుడు రవి

జంగారెడ్డిగూడెం టౌన్‌, అక్టోబరు 24: సీపీఎం జిల్లా మహాసభలను జయ ప్రదం చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎ.రవి పిలుపునిచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న సీపీఎం జిల్లా మహాసభలు జంగారెడ్డిగూ డెం పట్టణంలో నవంబర్‌ 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయని తెలిపారు. ప్రజాసమస్యలపై సాధించిన ఉద్యమాలు, కృషిని సమీక్షించుకొని భవిష్యత్‌ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. మూడేళ్లకోసారి జరిగే మహాసభలు కరో నా కారణంగా నాలుగేళ్ల తర్వాత జరుగుతున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా 300 మంది ప్రతినిధులతో పాటు జాతీయ రాష్ట్రనాయకులు హాజరవుతార న్నారు. మహాసభలతో పాటు సీపీఎం ఉద్యమ, సేవా కార్యక్రమాలు, రైతు వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు పోరా టాలపై ఎగ్జిబిషన్‌ జరుగుతుందన్నారు. మహాసభలను జయప్రదం చేయాల ని విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం  పట్టణ కార్యదిర్శ చల్లారి మాణిక్యాలరావు, అందుగుల ప్రభాకర్‌, జి.సూర్యకి రణ్‌, మాభు.సుభాని, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:47:53+05:30 IST