అధ్వాన రోడ్లను బాగుచేయాలని సీపీఎం పాదయాత్ర
ABN , First Publish Date - 2022-01-29T04:50:39+05:30 IST
మున్సిపల్ పరిధిలో అధ్వానంగా ఉన్న రోడ్లును వెంటనే బాగు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవా రం పాదయాత్ర నిర్వహించారు.
ఆత్మకూరు, జనవరి 28 : మున్సిపల్ పరిధిలో అధ్వానంగా ఉన్న రోడ్లును వెంటనే బాగు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవా రం పాదయాత్ర నిర్వహించారు. నెల్లూరుపాళెం సెంటర్ నుంచి బయలు దేరిన పాదయాత్ర ప్రధాన రహదారి వెంబడి మూడు కిలోమీటర్లు మేర కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన రహదారులన్నీ గుంటలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేక్రమంలో ఆత్మకూరు నుంచి బట్టేపాడు, మురగళ్ల, కనుపూరుపల్లికి వెళ్లే రహదారులు గుంతలమయమై అధ్వానంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, అనుబంధ సంఘాల నాయకలు కె డేవిడ్రాజు, జి లక్ష్మీపతి, మునిపల్ మాజీ వైస్ఛైర్మన్, షేక్ సందాని, లక్కు కృష్ణప్రసాద్, యస్ధానీ తదితరులు పాల్గొన్నారు.