సీపీఎస్ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-07-24T04:47:31+05:30 IST
సీపీఎస్ను రద్దు చేయాలి
- డీఏ బకాయిలు చెల్లించాలి
- ఉపాధ్యాయుల నిరసన
గుజరాతీపేట, జూలై 23: పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై శుక్రవారం శ్రీకా కుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. విద్యాశాఖలో అన్ని యాజమాన్యాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో పదోన్నతుల కోసం షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. నూతన విద్యా విధా నంపై స్పష్టతనివ్వాలని.. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించొద్దని కోరారు. మృతిచెందిన ఉపాధ్యా యుల కుటుంబ సభ్యులకు గ్రీన్ఛానల్ ద్వారా కారుణ్య నియా మకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీజీఎల్ఐ, పీఎఫ్ లోన్లు, ప్రతి నెలా జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షుడు దాలినాయుడు, డీటీఎఫ్, పీఈటీ, ఏపీటీఎఫ్, పెన్షనర్స్ సంఘ నాయకులు పాల్గొన్నారు.