క్రెడిట్ కార్డులో నగదు మాయం
ABN , First Publish Date - 2020-10-19T05:22:37+05:30 IST
ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి ఖాతా లోంచి రూ.67,800 మాయమైంది.
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 18: ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి ఖాతా లోంచి రూ.67,800 మాయమైంది. ప్రకాష్నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక గాంధీపురం-3కు చెందిన కె.వెంకటనారాయణ ఈనెల 12న ఆన్లైన్లో రూ.7200 విలువైన వస్తువులు కొనుగోలు చేశాడు. అయితే తన క్రెడిట్ కార్డు ద్వారా రూ.67,800 విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్టు బ్యాంక్ స్టేట్ మెంట్ రావడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.