వీహెచపీ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు
ABN , First Publish Date - 2021-05-17T05:20:45+05:30 IST
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీనివాసచారి మృతదేహానికి విశ్వహిందూపరిషత, బజరంగదళ్ సభ్యులు హిందూ సంప్రదాయరీతిలో దహనసంస్కారాలు నిర్వహించారు.
హిందూపురం టౌన, మే 16: హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీనివాసచారి మృతదేహానికి విశ్వహిందూపరిషత, బజరంగదళ్ సభ్యులు హిందూ సంప్రదాయరీతిలో దహనసంస్కారాలు నిర్వహించారు. ఇటీవల కొవిడ్ కారణంగా మృతిచెందితే దహనసంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోతే అలాంటివారు విశ్వహిందూపరిషత నాయకులకు తెలియజేస్తే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వీహెచపీ నాయకులు చారుకీర్తి మాట్లాడుతూ వీహెచపీ, బజరంగదళ్ ఆధ్వర్యంలో మేముసైతం హిందూపురంలో ఓ కమిటీగా ఏర్పడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము. హెల్ప్లైన డెస్క్ ఏర్పాటు చేశామని ఎవరైనా మృతిచెంది దహనసంస్కారాలకు ఇబ్బంది పడుతున్నట్లయితే 7207388101కు సంప్రదించాలన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.