సిరాజ్‌ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ABN , First Publish Date - 2021-01-21T06:51:55+05:30 IST

ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీ్‌సలో అంచనాలకు మించి రాణించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశంసించారు.

సిరాజ్‌ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వీహెచ్‌

మాజీ ఎంపీ వీహెచ్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీ్‌సలో అంచనాలకు మించి రాణించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశంసించారు. ఫతేమైదాన్‌ క్లబ్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సిరాజ్‌ నగరానికి చేరుకున్నాక అతణ్ణి ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సన్మానాన్ని సిరాజ్‌ అంగీకరించాలని.. అతడి వెసులుబాటు చూసుకుని వచ్చే శని, ఆదివారాల్లో సన్మానానికి సమయం ఇవ్వాలని వీహెచ్‌ కోరారు. ‘తండ్రి మరణ వార్తను తట్టుకుని టెస్టు సిరీ్‌సలో అతడు 13 వికెట్లు తీయడం ఆషామాషీ కాదు. నేను నిర్వహించిన రాజీవ్‌గాంధీ అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో కూడా అతడు గతంలో చక్కగా ఆడాడు. కెరీర్‌లో సిరాజ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని వీహెచ్‌ అన్నారు.


Updated Date - 2021-01-21T06:51:55+05:30 IST